ప్రస్తుతం కరోనా వైరస్- Coronavirus వలన ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు . ఈ నేపథ్యంలో దేశ ప్రజలు అందరూ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదరుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా వాక్సీన్- vaccine కి ఇండియా లో అనుమతి లభించింది. ఇటీవల DCGI (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మన దేశంలో కోవిషీల్డ్ (covishield) మరియు కోవాగ్జిన్ (Covaxin) వ్యాక్సీన్లకు ఆమోద ముద్ర వేసింది. ఐతే ఆమోదిస్తూ కొన్ని షరతులను విధించింది. కేవలం అత్యవసర సమయంలో మాత్రమే వీటిని వినియోగించాలని ప్రకటించింది. ఐతే ఈ వాక్సిన్ ల పై క్లినికల్ ట్రయల్స్ మాత్రం కొనసాగుతాయని డీసీజీఐ డాక్టర్ వి.జి. సోమని స్పష్టం చేశారు.
కోవీషీల్డ్ మరియు కోవ్యాగ్జిన్ రెండు వాక్సిన్ లను సాధారణ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేయవచ్చు. అదే ముందుగా రూపొందిపబడిన ఫైజర్ లాంటి వ్యాక్సిన్లకు అయితే మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరం. భారత్లో అలాంటి టెంపరేచర్ ల వద్ద వ్యాక్సిన్లను నిల్వ చేయడం కష్టం. ఇది దృష్టిలో పెట్టుకునే డీసీజీఐ కోవీషీల్డ్ మరియు కోవ్యాగ్జిన్ లకు అత్యవసర వినియోగానికి అనుమతిని ఇచ్చింది.
అయితే భారత్ బయోటెక్- Bharat Biotech రూపొందించిన కొవ్యాగ్జిన్ ను 12 ఏళ్ళు పైబడిన పిల్లలకు అలాగే సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన కొవిషీల్డ్ ను 18 ఏళ్ళ పైబడిన వారికి వెయ్యడానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. జనవరి 3 వ తేదీన డీసీజీఐ ఈ రెండు వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించేందుకు అనుమతిని ఇచ్చిన విషయం విదితమే.
ఆ రెండు వాక్సిన్ లనూ రెండు డోసుల్లో ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సీరమ్- Serum సీఈవో పునావాలా మాట్లాడుతూ కొవిషీల్డ్ డోసులను ప్రభుత్వానికి రూ. 200కు అమ్ముతామని ఆ తర్వాత రేటు ను పెంచుతామని తెలియజేసారు. ఈ వాక్సిన్ ను మార్కెట్లో రూ. 1,000కి అమ్ముతామని ఆయన చెప్పుకొచ్చారు.