వివాహ సమయాలలో తప్పకుండా చెప్పవలసిన మంత్రాలు దర్మేచ ,అర్దేచ ,కామేచ ,నాతి చరామి అని. దాని అర్దం జీవితం లో ప్రతి విషయంలోను తను చేసుకోబోయే స్త్రీ తోనే కలసి నడుస్తాను అని. అయితే అన్ని మంత్రాలు మాదిరే అది కూడ ఒక మంత్రం అనుకుని ప్రతి వరుడు మొక్కుబడిగా ఆ నాలుగు మాటలు అనేసి, తంతు ని మమ అనిపిచేస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఆ నాలుగు మాటలకు కట్టుబడి కాపురం చేయ గలిగిన వాడే నిజమైన గృహస్థుడు. మెదక్ జిల్లా వాసి ఎనిమిదేళ్లుగా భార్య కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. సర్వం కోల్పోయి, సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
మెదక్ జిల్లా, నిజాంపేటకు చెందిన తిరునగరి కృష్ణమూర్తి, విజయ భార్యాభర్తలు. వారికీ ఒక కుమార్తె. ఎమిదేళ్ల క్రితం మలేరియా జ్వరం వచ్చి మెదడు, వెన్నుపూస దెబ్బతినడంతో కృష్ణమూర్తి భార్య విజయ అనారోగ్యంపాలై కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని, రోజులో 7,8 సార్లు పిట్స్ వస్తున్నాయని..ఆమె బాధ చూసి తట్టుకోలేకపోతున్నానని కన్నీటిపర్యమంతమయ్యాడు. కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటుందని, ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాటం చేస్తోందని అన్నాడు. . అప్పటినుంచి తనే తల్లితండ్రి అయ్యి ఆమెను చంటిపాపలా చూసుకుంటున్నాడు. ఎలాగైనా తన భార్యను బతికించుకోవాలని అన్ని ఆస్పత్రులకు తిప్పాడు. వైద్యానికి ఇప్పటి వరకు రూ. 10 లక్షలకు పైగానే ఖర్చు చేశాడు. అపోలో ఆస్పత్రిలో వైద్యం చేస్తే బాగవుతుందని ఓ వైద్యుడు చెప్పగా, కృష్ణమూర్తి ఆశలు చిగురించాయి. కనీసం తినడానికి తిండిలేని ధైన్యస్థితిలో తమ కుటుంబం ఉందని దాతలు చేయూత ఇవ్వాలని ఆయన వేడుకుంటున్నాడు. అయితే సాయం అందకపోతే ఆత్మహత్యే శరణమ్యని అంటున్నాడు. దాతలు ఎవరైనా తనకి సాయంచేయాలని కోరుకుందాం.