Murder: తమ కులాలు వేరైనప్పటికీ ప్రేమించి పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు నెల్లూరు లోని ఓ ప్రేమ జంట. ఇంతలోనే ఆ అమ్మాయిని కడతేర్చాడు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కి చెందిన కోడి హరికృష్ణ అనే వ్యక్తి ఓ స్వీట్ దుకాణంలో పని చేస్తున్నాడు. గత సంవత్సరం జూన్ నెలలో ఇతనికి కొడవలూరు మండలం గిరిజన కాలనీకి చెందిన గడ్డం స్రవంతి(19) అనే యువతి తో వివాహం జరిగింది. ఈమె కూడా దగ్గరలోని ఓ స్వీట్ షాప్ లో పనిచేస్తుంది.
హరికృష్ణ వీరి పెళ్లి జరిగాక కేవలం రెండు రోజులు మాత్రమే స్రవంతి తో ఉన్నాడట. ఆ తర్వాత రోజు ఆమెను పుట్టింటిలో దింపాడట. ఆ తరువాత ఆషాడమాసం ప్రారంభం అవ్వడంతో ఆమెను పుట్టింటిలో నే ఉంచాడట. అప్పుడప్పుడు వచ్చి ఆమెను చూసి వెళ్తూ ఉంటేవాడట. ఇలా కొన్ని రోజులు సాగాక స్రవంతి మీద అనుమాన బీజం పడడంతో వాళ్ళ పుట్టింటికి రావడం చాలా తగ్గించేసాడట. అంతేకాకుండా గత నాలుగు నెలలుగా తన పుట్టింట్లోనే ఉంటున్న స్రవంతికి కనీసం ఫోన్ కూడా చేయలేదట.
సడన్ గా ఒక రోజు స్రవంతి వాళ్ళ పుట్టింటికి వెళ్లగా అక్కడ ఎవ్వరు లేరట. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లిందని తెలియడంతో అక్కడికే వెళ్లి వాళ్ళని ఒప్పించుకుని బాగా చూసుకుంటా అని అమ్మాయిని తీసుకెళ్ళడట. ఇంతలో చీకటి పడడంతో స్రవంతి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండమని చెప్పి వారికీ ఆ ఇంటి తాళాలు ఇచ్చారట. ఇదే సమయం అనుకుని అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉన్నప్పుడు గొంతుకోసి పరారయ్యాడు.
మరుసటి రోజు ఉదయం స్రవంతి అక్క తలుపు తియ్యగానే తన చెల్లి చ్చనిపోయిందని అర్ధమయ్యింది. బాధితుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. హరికృష్ణ మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.