టాలీవుడ్ లో 13 ఏళ్ళకి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్త తో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోస్ ని షోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి పంచుకుంటోంది. అంతేకాదు త్వరలో హైదారాబాద్ లో ఉన్న సినిమా సన్నిహితులకి ఒక గ్రాండ్ పార్టీ అలాగే, చెన్నైలో ఉన్న సన్నిహితులకి ఒక పార్టీ ఇవ్వబోతుందట.
అయితే కాజల్ పెళ్ళి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది కాబట్టి ఇక సినిమాలు చేయదన్న ప్రచారం జరుగుతుండగా చాలా క్లియర్ గా పెళ్ళి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని తెలిపింది. అయితే ఊహించని విధంగా కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతుందని సమాచారం. తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో కాజల్ ఒప్పుకోవాలే గాని భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తారు.
అయినా బిజినెస్ మీద ఆసక్తి ఉండటంతో ఇప్పుడు కొత్తగా ఓకీ అనే గేమింగ్ సంస్థలో భాగస్వామిగా చేరిందని తెలుస్తోంది. ఆ సంస్థలో 15% వాటాను కొనుగోలు చేసిందట కాజల్. ఆన్ లైన్ గేమింగ్ సంస్థ అయిన ఓకీ ఎన్నో గేమ్స్ ను ఆన్ లోన్ లో వినియోగదారుల కోసం ఉంచింది. ఓకీ గేమింగ్ సంస్థలో భాగస్వామి అయిన కాజల్..ప్రత్యేకించి అమ్మాయిల కోసం ఒక గేమ్ ని తీసుకు వస్తున్నట్టు వెల్లడించింది.
కాగా ఇందులో భర్త గౌతమ్ కిచ్లు సహకారం ఉందని చెప్పుకుంటున్నారు. ముంబయి బేస్డ్ వ్యాపార వేత్త గా గౌతమ్ ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని ఇది వరకే కాజల్ వెల్లడించింది. ఆకారణంగానే వ్యాపారాల్లోకి కాజల్ ని తీసుకు వచ్చాడని అంటున్నారు. మొత్తానికి పెళ్ళైన కొన్ని రోజుల్లోనే కాజల్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. కాగా మెగాస్టార్ తో ఆచార్య, కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ .. వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?