హైదరాబాద్ ను పొగ మంచు కమ్మేసింది. శివారు ప్రాంతాలను పొగమంచు చుట్టేయడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లాండింగ్ కు వాతావరణం అనుకూలించకపోవడంతో చెనై ఎయిర్ పోర్టు కు విమానాలను దారి మళ్లించారు. ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను చెన్నైకి దారి మళ్లించారు. చెన్నై నుండి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానాన్ని తిరిగి చెన్నై కు తరలించారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా అనేక విమానాలను చెన్నైకి మళ్లిస్తున్నారు. బయలుదేరాల్సిన విమానాలు కూడా ఆలస్యంగా మారాయి.
పొగమంచు కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు విమాన సర్వీసులు రాకపోవడంతో ముందుగా ప్రయాణం ఫిక్స్ చేసుకున్న ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము అనుకున్న సమయానికి చేరుకోలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభం అయ్యేది అధికారులు చెప్పలేకపోయారు.