గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో అదనపు బలగాలను దింపి ఎక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ఉన్నతాధికారులను అక్కడ నియమించి మోనిటరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా సీసీ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకునే విధంగా పోలీస్ స్టేషన్ వద్ద జియో ట్యాగింగ్ చేసి సోషల్ మీడియా పై ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ గత రెండు వారాల నుండి పోలీసులు ఏ విధంగా గ్రేటర్ ఎన్నికల విధులు నిర్వహించాలో వంటి విషయాల్లో అలర్ట్ గా ఉన్నారు అని తెలిపారు. ముఖ్యంగా వాహనాల చెకింగ్ అదేవిధంగా లిక్కర్, డబ్బులు ఎక్కడైనా పంచితే ఊరుకునే ప్రసక్తి లేదని, ఇప్పటికే ఈ విషయాలకు సంబంధించి అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇచ్చినట్లు అంజనీ కుమార్ తెలిపారు. అనుమానం వస్తే ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తే రెచ్చగొట్టే విధంగా పోస్టులు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఇప్పటికే 20 కేసులు ఈ విధంగా వ్యవహరించిన వారిపై పెట్టినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పుకొచ్చారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత మళ్లీ బ్యాలెట్ రూపంలో హైదరాబాద్ నగరం లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఓటు వేయడం కోసం పోలింగ్ సెంటర్ కు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తే నే ఓటు వేసే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇదిలా ఉండగా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా 3 నిమిషాలలో అక్కడ చేరుకోవటానికి స్పెషల్ టీం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పుకొచ్చారు.