హైదరాబాద్ లో రోజూ కనీసం ఐదు వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. అదీ కాకుండా ప్రతిరోజూ కనీసం వందల మంది పరిస్థితి విషమంగా తయారవుతోంది. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చాలామంది ప్రాణాలు కాపాడలేకపోతున్నారు డాక్టర్లకు కూడా పని ఒత్తిడి విపరీతంగా ఎక్కువైపోయింది.
ఇకపోతే కరోనా సోకక ముందు నుండే ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. దీనితో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి డాక్టర్లు ఐసీఎంఆర్ నుండి హుటాహుటిన ప్లాస్మా థెరపీ కి పర్మిషన్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా చివరి ప్రయత్నంగా వారిని బ్రతికించేందుకు వారిపై క్లినికల్ ట్రయల్స్ వేసేందుకు కూడా ఐసీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడం గమనార్హం.
కరోనా కు అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పబడుతున్న రెమిడిసివిర్ మరియు ఫెమిపరివిర్ మందులను చివరి ప్రయత్నంగా పేషెంట్ల కుటుంబసభ్యుల అనుమతితో మరియు ఐసీఎంఆర్ ఆమోదంతో వారిపై ప్రయోగిస్తున్నారు. ఇక వారు ఎన్ని ప్రాణాలను ఈ మందులతో కాపాడగలిగితే అవి అంత సక్సెస్ రేట్ ను సాధించాయని లెక్క. మరి చూద్దాం ఈ క్లినికల్ ట్రయల్స్ ఎంతమాత్రం సత్ఫలితాలను ఇస్తాయో.