అమెరికాలోని చికాగాలో జరిగిన కాల్పుల కలకలంలో హైదరాబాద్ పాతబస్తీ వాసి ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చికాగోలోని ఎస్ మిచిగాన్ ఎవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హైదరాబాద్ పాత బస్తీకి చెందిన మొహమ్మద్ ముజుబుద్దీన్ పై దుండగులు కాల్పులు జరిపారు.
మొహమ్మద్ ముజుద్దీన్ కారులో వస్తుండగా దుండగులు తుపాకి చూపి కారు ఆపారు. కారు నుండి తిగిన ముజుద్దీన్ నుండి వారు నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో దుండగులను ముజుద్దీన్ ప్రతిఘటించారు. ముజుద్దీన్ ను పక్కకు తోసి దుండగులు కారును తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. దీంతో దుండకులు ముజుద్దీన్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముజుద్దీన్ ను యూనివర్శిటీ ఆఫ్ చికాగో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం పాత బస్తీలోని ముజుద్దీన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.