జబర్దస్త్ టీమ్ మొత్తానికి కరోనా మహమ్మారి అంటుకుంది. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొని మరీ.. జబర్దస్త్ షోను నిర్వహిస్తున్నా.. జబర్దస్త్ టీంను మాత్రం కరోనా వదలడం లేదు.
ఇప్పటికే సుడిగాలి సుధీర్ కు కరోనా వచ్చిందని తెలిసిందే. ఆ తర్వాత రష్మీకి కూడా కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.
దీంతో.. జబర్దస్త్ టీమ్ లన్నీ కరోనా టెస్టులు చేయించుకున్నారట. జడ్జిలు, సాంకేతిక నిపుణులు కూడా టెస్టులు చేయించుకున్నారట.
అయితే.. హైపర్ ఆదికి అందరి కంటే ముందుగా కరోనా వచ్చిందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. హైపర్ ఆదికి సుడిగాలి సుధీర్ కంటే కూడా ముందే కరోనా వచ్చిందట. అయితే.. ఎవ్వరికీ తెలియకుండా.. వెంటనే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నాడట. వెంటనే రికవరీ అయి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడట హైపర్ ఆది.
సుధీర్ కంటే ముందే హైపర్ ఆదికి కరోనా వచ్చినా ఈ విషయం ఎవ్వరికీ ఎందుకు తెలియలేదు. ఒకవేళ.. సరిగ్గా క్యూర్ కాకముందే జబర్దస్త్ లోకి అడుగుపెట్టి.. హైపర్ ఆది.. జబర్దస్త్ టీంకు కరోనాను అంటించాడా? అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.
ఏది ఏమైనా.. అసలు హైపర్ ఆది ప్రస్తుతం కోలుకున్నాడా? లేక ఇంకా చికిత్స తీసుకుంటున్నాడా? అని ఆది అభిమానులు అందోళన చెందుతున్నారు.