తెలుగు ప్రజలకు పెద్ద పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి వచ్చాయంటే చాలు బుల్లితెర పై ప్రేక్షకులకు కావాల్సినంత సందడి ఉంటుంది. స్పెషల్ ఈవెంట్ లతో చానళ్లన్నీ ప్రజలను అలరించడానికి రెడీ గా ఉంటాయి. పోటీ పడి మరీ ఫన్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ గ్రాండ్ ఈవెంట్లలో ఈటీవీలో జబర్దస్త్ ఆర్టిస్టులు. స్టార్ మా లో సీరియల్ ఆర్టిస్టులు. బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఇక జీ తెలుగులో అదిరింది ఆర్టిస్టులు స్పెషల్ ఈవెంట్ లో చేస్తుంటారు.
యాంకర్లు ఆర్టిస్టులు అక్కడ ఇక్కడ తారుమారు అవుతూ ఉంటారు. ఒకప్పుడు తమ ఆర్టిస్టులు తమ చానల్ లోనే చేయాల్సి ఉంటుందని రూల్ ఉండేది అయితే ఇప్పుడు అవేమీ లేనట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ కంటెస్టెంట్లు సైతం ఇతర చానల్స్ లో పాల్గొంటున్నారు. ఈటీవీ దసరా ఈవెంట్ లో యాంకర్ గా నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది చేయలేదు.
మరోవైపు జీ తెలుగులో ప్రదీప్, శ్రీముఖి ఈవెంట్ చేశారు. ఈ సారి దీపావళికి మాత్రం ఈ టీవి చాలా గట్టిగా ప్లాన్ చేసింది. కనకమహాలక్ష్మి లక్కీ డ్రా విడుదలైన ప్రోమో లు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. స్పెషల్ అట్రాక్షన్ గా అనూప్ రూబెన్స్ ని తీసుకువచ్చారు. ఆ తర్వాత సోనుసూద్ ను ప్రోగ్రాం కు తీసుకొని వచ్చి మరో లెవల్ కి షో ను తీసుకువెళ్లే ప్లాన్ చేశారు.
ఇదే సమయంలో హైపర్ ఆది స్కిట్ లో భాగంగా టాప్ యాంకర్ శ్రీముఖి పై పంచ్ వేశాడు. దీపావళి టపాసులు గురించి మొత్తం తెలుసా అని రోహిణి ఆది ని అడుగుతుంది. అంతా తెలుసు అని చెబుతాడు. ఆ క్రమంలోనే శ్రీముఖి భూ చక్రం అని అంటాడు. అంటే శ్రీముఖి అంతా తిరిగి వస్తుందా అని ప్రశ్నిస్తే… అవును ఆమె అన్ని షోలను చేస్తుంది అని ఆది కౌంటర్ వేసాడు. ఆ షో, ఈ షో అని లేకుండా అన్ని చోట్లా చేస్తుంది అనేసరికి శ్రీముఖి తలపట్టుకుంది. ఆ కౌంటర్ తో జీతెలుగు తప్పించి మిగతా వారు ఆమెతో ఈవెంట్లు ఏం చేస్తారో సందేహమే…
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!