సౌత్ కొరియా కార్ల కంపెనీ హ్యుందాయ్..! భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్ సైజ్ ఎస్యూవీ “హ్యుందాయ్ క్రెటా” అమ్మకాల పరంగా దూసుకెళ్తోంది..! క్రెటా ఎస్యూవీ విభాగంలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలిచింది.. ఈ విభాగంలోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చిన కస్టమర్ల కు క్రెటా ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది.. తాజాగా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది..!!
హ్యుందాయ్ క్రెటా ని భారత మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటివరకు 5,00,000 లక్షల యూనిట్లను విక్రయించిందని కంపెనీ ప్రకటించింది.. సుమారు 5 సంవత్సరాల క్రితం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన క్రెటా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా హ్యాపీ కస్టమర్లను సంపాదించిందని కంపెనీ తెలిపింది.. హ్యుందాయ్ తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో “ది లెగిసి ఆఫ్ క్రెటా” పేరుతో ఓ ఆసక్తికరమైన వీడియోని విడుదల చేసింది. ఇందులో వివిధ కస్టమర్లు తమ క్రెటా తో తీసిన వీడియో బైట్ లు కంపెనీతో పంచుకున్నారు. ఆ వీడియోలన్నింటినీ కలిపి హ్యుందాయ్ అద్భుతమైన వీడియో ని తయారు చేసింది.
అప్గ్రేడ్ చేసిన 2020 క్రెటా మార్కెట్లో విడుదల చేసింది. ఇంతకు ముందు క్రెటా కంటే అత్యధికంగా అమ్ముడు పోవటం విశేషం. కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించడం లో విజయం సాధించింది.. 2020 లో మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ క్రెటా అతికొద్ది సమయంలోనే 65,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ దక్కించుకుంది. 2020 ఏప్రిల్ – జూలై మధ్య కాలంలో 34,212 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది. 2020 క్రెటా అనేక ఇంధన ఆప్షన్స్ తో అప్డేటెడ్, స్మార్ట్ ఫీచర్స్ తో వాహన ప్రియులను ఆకర్షిస్తుంది.
ఇది కూడా చదవండి : గూగుల్ కి పోటీ ఇస్తున్న కొత్త సెర్చ్ ఇంజిన్.. దాని యూజర్స్ ఎంతో తెలిస్తే షాకె