రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా వెలుగుతోంది. రష్మిక తో సినిమా చేసిన హీరోకి లక్ కలిసొచ్చి హిట్ పడుతుంది. అందుకే పూజా హెగ్డే తో పోటీ పడి మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. నాగ శౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో చేసిన గీత గోవిందం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇక రష్మిక ఈ ఏడాది ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరసగా చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుండటంతో ఇక ఇప్పట్లో రష్మిక కెరీర్ కి బ్రేకులు పడే అవకాశమే లేదన్న టాక్ వినిపిస్తుంది. అయితే మరో వైపు తన పెళ్ళికి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండటం ఆసక్తికరంగా మారింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రష్మిక పాపులర్ కాక ముందే పెళ్లి నిశ్చితార్థం అయ్యింది. కాని వ్యక్తిగత కారణాల వల్ల ఆ పెళ్లిని రష్మిక క్యాన్సిల్ చేసుకుని సినిమాలతో బిజీ అయ్యింది. ఈ కారణంగానే అప్పుడప్పుడు రష్మిక పెళ్లి గురించి అభిమానులు సోషల్ మీడియా వేదిక గా అడుగుతున్నారు.
ఈ క్రమంలో మిమ్ములను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటీ అంటూ ఒక ప్రశ్న రష్మిక మందన్న కి ఎదురైందట. అందుకు రహ్మిక ఇచ్చిన సమాధానం అందరికి ఆసక్తిగా అనిపించిందటున్నారు. ‘నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు నాదగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడాలి’. ముందుగా నన్ను ఎలా కలవాలి అనే విషయాన్ని నా టీమ్ ను అడిగి తెలుసుకోండి… అంటూ ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఇదే సమయంలో తను ఎవరితోను ప్రేమలో లేనన్న క్లారిటీ కూడా ఇచ్చేసింది.