‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాతో మాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా దక్షిణాది సినిమాలను ఆకట్టుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ ముద్దగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. కోలీవుడ్లో ధనుష్కు జంటగా ‘కోడి’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనుపమ. ఈ సినిమా మంచి సక్సెస్ అయినా కూడా కోలీవుడ్లో ఈ అమ్మడును ఎవరూ లెక్క కూడా చేయడం లేదు. ఆ తర్వాత హీరో అధర్వ సరసన ‘తల్లిపోగాదే’ మూవీలో యాక్ట్ చేసింది. దురదృష్టం ఏంటంటే, ఈ సినిమా కూడా ఆమె కెరీర్కి ఉపయోగపడనే లేదు. టాలీవుడ్ సినిమాలు కూడా ఆమెకు ప్లాప్స్ యే ఇస్తున్నాయి. దాని వల్ల అవకాశాలు రావట్లేదు.
కార్తికేయ 2 సినిమాతో క్రేజ్
అలాంటి సమయంలో కార్తికేయ 2 సినిమా ఆమెకి మంచి ప్లస్ పాయింట్గా మారింది. రీసెంట్ రిలీజ్గా అయిన కార్తికేయ 2లో నిఖిల్ సిద్ధార్థకు జంటగా నటించి మళ్లీ ఫేమ్ తెచ్చుకుంది. కార్తికేయ 2 బాలీవుడ్లో కూడా మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోవడంతో అనుపమకు అక్కడ కూడా సినీ ఆఫర్స్ వస్తున్నాయట. త్వరలోనే అనుపమ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నేను ఆ సినిమాలు చెయ్యను
అనుపమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో నటించడానికి తనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయని చెప్పింది. హీరోలను పొగుడుతూ, హీరో చుట్టే తిరిగే రోల్స్లో నటించనని ఆమె చెప్పుకొచ్చింది. ఆ టైపు సినిమాల జోలికి కూడా వెళ్లనని తెలిపింది. ఆమె నటించే సినిమాల్లో కథే హీరోగా ఉండాలని చెప్తుంది. కేవలం అలాంటి చిత్రాల్లో నటించడానికే తాను ఇష్టపడతానని అనుపమ ఒక క్లారిటీ ఇచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో చాలా తక్కువగా చిత్రాలని నిర్మిస్తున్నారని.. తక్కువ బడ్జెట్లో సినిమాలను నిర్మిస్తూ ఉంటారని తెలిపింది. ప్రస్తుతం ఓటీటీలు రావడం వల్ల సినిమాలు రీమేక్ చేయకుండానే ప్రేక్షకులు అన్ని భాషల్లో చూడగలుగుతున్నారని అన్నది. భాష ఏదైనా కథ బలం ఉన్న సినిమా అయితే తాను నటించడానికి రెడీ అన్నది.