పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా కు దర్శకత్వం వహించి సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి… అగ్ర దర్శకుడు గా పేరు సంపాదించుకున్నారు పూరీ జగన్నాథ్. పోకిరి, ఇడియట్, సూపర్, దేశముదురు, శివమణి, చిరుత వంటి సినిమాలతో తన రూటే సపరేట్.. రికార్డుల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లో క్లాస్, మాస్, ఎమోషనల్ వంటి నవ రసాలు ఉంటాయి.
చూడ్డానికి గంభీరంగా, ధైర్యంగా కనిపిస్తారు పూరీ, కానీ ఆయన ప్రతి చిన్న విషయానికి కూడా బాగా ఎమోషనల్ అవుతుంటారు. కానీ దాన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త తీసుకుంటారని ఆయన సన్నిహితులు చాలా సార్లే చెప్పారు. ఇది వరకు పలుమార్లు ఏడ్చాడు కూడానూ. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో చూసిన పూరీ జగన్నాథ్.. చాలా ఎమోషనల్ అయి.. ఏడ్చేశాడు.
అంతలా ఆయన ఏడ్చే వీడియో ఏముంటుంది అనే కదా మీ ప్రశ్న? అదేంటంటే.. కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా షూటింగులు ఆగిపోవడంతో పాటు థియేటర్లు సైతం మూతపడ్డాయి. లక్షల మంది సినీ నటులు, కార్మికులు, థియేటర్లలో పని చేసే వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. పలువురు ప్రాణాలను సైతం తీసుకున్నారు. ఇటీవలే లాక్ డౌన్ సడలింపులతో తిరిగి పలు ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకుంటున్నాయి.
ఈ సందర్భంగా కన్నడ సినీ పరిశ్రమ ప్రేక్షకులను థియేటర్లకు రావాలని కోరుతూ… “కమ్ లెట్స్ సెలబ్రేట్ సినిమా అగైన్” అంటూ సాగుతున్న ఓ వీడియోను విడుదల చేసింది. దీనిని చూసిన పూరీ జగన్నాథ్.. ఎమోషనల్ అయి.. కన్నీరు పెట్టుకున్నారు. ” ఈ వీడియో చూసాక కన్నీళ్లు ఆగడం లేదు. మళ్ళీ పాత రోజులు రావాలి. థియేటర్లు నిండాలి. చొక్కాలు చిరుగాలి. విజిల్స్ మోతతో పేపర్లు ఎగరాలి. థియేటర్ మన అమ్మ” అంటూ తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు పూరీ జగన్నాథ్. కన్నడ హీరోలు.. కార్మికులు కనిపిస్తున్న ఆ వీడియో మీరు చూసేయండి మరి.!