రావల్పిండి: ‘భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను రేపు విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికోసం అతనిని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
అంతకు ముందు, వర్ధమాన్ విడుదల విషయంలో ఎటువంటి డీల్ లేదా చర్చలకు అంగీకరించేది లేదు’ అని భారత్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వింగ్ కమాండర్ను అడ్డం పెట్టుకుని పాక్ బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తే అందుకు అంగీకరించేది లేదని పేర్కొన్నారు.
ఐఏఎఫ్ పైలెట్ను కలిసేందుకు పాకిస్తాన్లోని భారత దౌత్యాదికారులకు అవకాశం ఇవ్వాలని తాము కోరుకోవడం లేదని, బేషరతుగా అతన్ని సురక్షితంగా తిరిగి అప్పగించాల్సిందిగా మాత్రమే డిమాండ్ చేస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.
శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరిస్తే వింగ్ కమాండర్ను అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని పాక్ విదేశాంగ మంత్రి సయ్యద్ మహమ్మద్ ఖురేషి న్యూస్ ఎజన్సీకి తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?