ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి కడపలో పర్యటించిన సమయంలో పలు మీడియాల్లో అక్కడ సీబీఐ విచారణకు హజరైన వారితో కలిసి కారులో ప్రయాణించారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై జవహర్ రెడ్డి ఆ వార్తలను ఖండించారు. తాజాగా జవహర్ రెడ్డిపై వచ్చిన తప్పుడు వార్తలను ఐఏఎస్ అసోసియేషన్ ఖండించింది. జవహర్ రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమనీ, తప్పుడు వార్తలని పేర్కొన్నారు.
సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదని వారు పేర్కొన్నారు. తప్పుడు కథనాలపై అసోసియేషన్ లో చర్చించడం జరిగిందన్నారు. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగానే సీఎం జవహర్ రడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ తెలిపారు. సీనియర్ అదికారిపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని, ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
అమరావతి అంశంపై చంద్రబాబు వర్సెస్ సజ్జల హాట్ కామెంట్స్ ఇలా..