అమరావతి, ఏప్రిల్ 23: ఐఎఎస్ అధికారుల సంఘ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చించే అజెండా అంశంగా విజయవాడ పున్నమి ఘాట్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేవలం 14మంది మాత్రమే హజరయ్యారు.
184మంది సభ్యులు ఉన్న ఈ సంఘంలో సమావేశం నిర్వహించేందుకు కనీసం 46మంది పాల్లొంటే కోరం పూర్తి అవుతుంది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
చాలా మంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
సమావేశానికి జవహర్ రెడ్డి,జెఎస్ వి ప్రసాద్,ప్రవీణ్ కుమార్,ప్రసన్న వెంకటేష్,పి.ఉషాకుమారి, కరికల్ వలవన్, సునీత,శామ్యూల్ తో పాటు ఐదుగురు ప్రొహిబిషనరీ ఐఎఎస్ లు హజరయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?