ఏపి పురపాలక శాఖ మంత్రి అదిమూలపు సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయనకు ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) ఫెలోగా పని చేసే అవకాశం దక్కింది. ఈ మేరకు సురేష్ కు తన ఫెలోగా గుర్తిస్తూ ఐఈటీఈ శనివారంప్రకటన విడుదల చేసింది. విజయవాడలోని తమ కేంద్రం పనుల్లో భాగస్వామ్యం కావాలని సురేష్ ఐఈటీఈ కోరింది.
ప్రస్తుతం జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో ఉన్న ఆదిమూలపు సురేష్ రాజకీయాల్లోకి రాకముందు ఐఆర్ఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కు చెందిన ఆదిమూలపు సురేష్ కేంద్ర సర్వీసు నుండి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. 2009 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి తొలి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం సురేష్ వైసీపీలో చేరారు. 2014 లో సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మరల ఎర్రగొండపాలెం నుండి పోటీ చేసి విజయం సాధించి జగన్మోహనరెడ్డి తొలి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా, ఆ తరువాత ప్రస్తుతం పురపాలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయనకు ఐఈటీఈ ఫెలో అరుదైన గౌరవం లభించడం పట్ల ఆయన సన్నిహితులు అభినందనలు తెలియజేస్తున్నారు.
అవార్డులు సాధించిన ప్రజ-ా ప్రతినిధులు, అధికారులను అభినందించిన సీఎం జగన్