ప్రభాస్ ఇప్పుడు ఒక విషయంలో మాత్రం పక్కా క్లారిటీ ఉన్నాడు అనిపిస్తోంది….పాన్ ఇండియా టార్గెట్ కాదు వరల్డ్ నే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. వరుస సినిమాలతో బిజీ బిజీ షెడ్యూల్ తో భారీ బడ్జెట్ సినిమాని ముందుకు దూసుకెళ్తున్నాడు . టాలీవుడ్ కోలవుడ్, బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లెవల్ లో తన సత్తా చాటబోతున్నాడు. లేటెస్ట్ గా ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లు ఓ సినిమా చేయబోతున్నాడు. వైజయంతి మూవీస్ 50 వ సినిమా కాగా… ఈ సినిమా బడ్జెట్ వింటే మైండ్ బ్లాకవుతుంది. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో 500 కోట్ల రూపాయలతో ఏ సినిమా నిర్మించలేదు.
50 సినిమా కావడం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ తో ఈ పాన్ ఇండియన్ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే జోడీ కట్టనుంది. మరో కీలక పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్
కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ నటులు ఈ మూవీలో నటిస్తున్నారంటే ఈ మూవీ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో నటించే తారలకు రెమ్యూనరేషన్ కూడా కోట్లల్లోనే ఇవ్వబోతున్నారు. దీపికా పదుకొనే రెమ్యూనరేషన్ భారీగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అమితాబచ్చన్ ఈ సినిమా కోసం 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని చెప్పుకుంటున్నారు. ఈ రెమ్యూనరేషన్ దీపిక తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే అని సమాచారం. వీరికే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఉంటే ఇక ప్రభాస్ కు ఎంత మొత్తంలో ముట్ట చెబుతున్నారోనని ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. కాగా ప్రభాస్ కి భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తో పాటు ప్రాఫిట్ లో షేర్ ఇవ్వనున్నారన్న మాట వినిపిస్తోంది. అయితే ప్రభాస్ కి పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ కి రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ అంటున్నారట.