తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు పార్టీని ముందుకు నడిపిస్తున్న విధానం పార్టీ పెద్దలను ఎంతగానో ఆకర్షిస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ ని దెబ్బ కొట్టి మరి బిజెపి పార్టీని గెలిపించడం లో బండి సంజయ్ నాయకత్వ పటిమ తీరు పార్టీ పెద్దల చేత శభాష్ అనిపించేలా చేసింది.
ఒకపక్క కేసీఆర్ నియోజకవర్గం మరోపక్క హరీష్ రావు నియోజకవర్గం మధ్యలో ఉన్న దుబ్బాక లో బిజెపి గెలవడం అనేది సంచలనంగా పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో కూడా కాషాయ జెండా ఎగరాలి అని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఫార్ములా వాడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన ఊపు గ్రేటర్ లో కూడా కొనసాగేలా పావులు కదుపుతున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా గెలిస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బిజెపి గెలవటం గ్యారెంటీ అని కాబట్టి పాదయాత్ర చేస్తే, ఎన్నికలలో గెలిస్తే భవిష్యత్తులో బీజేపీకి తిరుగుండదని బండి సంజయ్ భావిస్తున్నారట. నగర పరిధిలో 150 డివిజన్లు ఉండటంతో పాదయాత్రకు రెడీ అవుతూ ముందుగా పార్టీ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి బండి సంజయ్ రెడీ అవుతున్నారట. ఇదిలా ఉండగా వచ్చే వారం నుండి గ్రేటర్ పరిధిలో ముందుగా బిజెపి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పాదయాత్ర మొదలు పెట్టానున్నారట. ఖచ్చితంగా జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో సర్వేల ప్రకారం బీజేపీకి 100కి పైగా సీట్లు వస్తాయని బండి సంజయ్ అనుకుంటున్నారట. ముఖ్యంగా గ్రేటర్ లో వరదల కారణంగా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొనటం తో పాటు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందకపోవడంతో కచ్చితంగా పాదయాత్ర కి మంచి రెస్పాన్స్ వస్తుందనే భావనలో తెలంగాణ బిజెపి ఉంది.