childrens: ఇంట్లో నెమలి ఈకలు కట్టను పెట్టుకోవడం వల్ల సూక్ష్మ శరీర పీడ లు ఉండవు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటే రోజూ తాంబూలాన్ని తయారు చేసి మీ పూజగదిలో అమ్మవారికి సమర్పించిన ఇద్దరు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సూర్య భగవానునికి అర్ఘ్యం ఇచ్చే జలంలో ఎర్రని పూలు,ఎర్ర చందనం,కుంకుమపువ్వు,గోరోచనం,జా
పిల్లలకు దిష్టి దోషాలు ఉన్నాయి అని అనిపిస్తే పసుపు కలిపిన బియ్యాన్ని వారిచే పక్షులకు తినిపించే విధంగా చేస్తే అన్ని దోషాలు పోతాయి. పిల్లలు సరిగ్గా మాట వినకపోతే, కుమారస్వామి ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మీ మీద ఏవైనా ప్రయోగాలు జరిగాయి అనే అనుమానం వస్తే ప్రత్యంగిరా,లేదా నృసింహ ఉపాసన చేసుకోవడం మంచిది.
శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం మీరు తినే ఆహారం లో నల్ల శనగలు ఉండేట్టు చూసుకోండి.
ఐదు తమలపాకులు తీసుకొని అన్నింటిపై చిన్న చిన్న బెల్లం ముక్క ఉంచి ఊరిబయట ఉన్న అమ్మవారి గుడిలో దీపం వెలిగించి యా దేవీ సర్వభూతేషు ధన రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్త్యస్త్యై నమస్త్యస్త్యై నమోనమః.ఈ స్తోత్రాన్ని 48 సార్లు జపించండి. తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పువ్వులు తీసుకొని ఇంట్లో డబ్బు పెట్టె చోట వాటిని ఉంచండి.
కొడుకుల్లో పెద్దవాడు ఒక్కసారైనా కాశీ,గయా వెళ్ళి పెద్దలకు పిండప్రదానాలు చేసిన రావడం ఆ కుటుంబాలకు చాలా మంచిది.
ప్రతి శనివారం తప్పకుండా ఇంట్లో ఉన్న పగిలిన,విరిగిన వస్తువులు తీసేసి ,బూజు దులపడం శుభ్రం చేయడం వంటివి చేయండి.