ఆర్.ఎక్స్.100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ జనాలని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. డీప్ లిప్ లాక్స్, గ్లామర్స్ సిన్స్ లో రెచ్చిపోయింది. అంతేకాదు ఎమోషనల్ సీన్స్ లోను అంద్భుతంగా నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో బోలెడన్ని అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. చెప్పాలంటే అవకాశాలు వచ్చాయి. కాని అన్ని మొదటి సినిమా తరహాలోనే బోల్డ్ కథ లో నటించమనే వచ్చాయి. అంతేకాదు పాయల్ కి కథ చెప్పిన దర్శకులందరు తనని అదే కోణంలో ఆలోచించి చెప్పారు తప్ప మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ గాని, మిగతా జోనర్స్ కి సంబంధించిన కథ లు చెప్పలేదట.
దాంతో ఏ సినిమాని ఓకే చేయలేదు. మధ్యలో ఒక ఐటం సాంగ్ చేసి దెబ్బ తినింది. అంతేకాదు చేయను అంటూనే ఆర్ డి ఎక్స్ లవ్ అన్న సినిమా చేసింది. కథ లో పాయింట్ బావున్న దాన్ని తెర మీద చూపించడంలో దర్శకుడు ఫేయిల్ అయ్యాడు. ఆ ప్రభావం పాయల్ మీద పడింది. అంతే మళ్ళీ పాయల్ కి పెద్దగా అవకాశాలు రాలేదు.
అయితే గత ఏడాది చివరలో వచ్చిన వెంకీ మామ సినిమాలో వెంకటేష్ సరసన నటించి హిట్ అందుకుంది. కాని అది పాయల్ కి పెద్దగా ఉపయోగపడింది. లేదు. ఇక 2020 ప్రారంభంలోనే రవితేజ సరసన డిస్కో రాజా లో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దాంతో పాయల్ కి మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అయితే ఇటీవల తనకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో కలిసి పనిచేయాలన్న కోరిక బయట పెట్టింది. ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, బాలీవుడ్ కబీర్ సింగ్ పాయల్ కి చాలా నచ్చాయట.
అందుకే ఈ దర్శకుడితో కలిసి పనిచేసే అవకాశం వస్తే వదుకోనని అంటోంది. అంతేకాదు క్యారెక్టర్ ఎంత బోల్డ్ అయినా చేయడానికి ఓకే గా ఉన్నట్టు మాట్లాడుతుందట. అంటే శాలినీ పాండే ని మించి చేస్తుందనమాట. అయితే పాయల్ ఇలా మాట్లాడటానికి ఒక రీజన్ ఉంది. తాజాగా సందీప్ రెడ్డి వంగ లాక్ డౌన్ లో విజయ్ దేవరకొండ కోసం ఒక కథ రాశాడట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకే పాయల్ ఇప్పుడు తన మనసులో మాట బయట పెట్టిందేమో.