వైసిపి ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన బీసీ సంక్రాంతి సభ అంగరంగ వైభవంగా జరిగింది. బీసీ సామాజిక వర్గాలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరైన న్యాయం జరిగిందని చాలామంది బీసీ వర్గాలకు చెందిన కీలక నాయకులు పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు బీసీ వర్గానికి చెందిన వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూడటం జరిగిందని, కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఇలా ఉండగా ఈ కార్యక్రమానికి పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల ప్రజలు నాయకులు జగన్ లాంటి ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో వుండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్ర ప్రజలను నాయకులను ప్రభావితం చేసే రీతిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
కరోనా లాంటి కష్ట సమయంలో దేశంలో చాలా రాష్ట్రా ప్రభుత్వాలు తమ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోకుండా పరిపాలించడం చాలా గ్రేట్ అని తెలిపారు. ఏపీ లో జగన్ పరిపాలన అమలవుతున్న సంక్షేమ పథకాల విధానం చూసి ఇతర రాష్ట్ర నాయకులకు మతిపోతుంది అని మల్లాది కృష్ణా రావు స్పష్టం చేశారు. రాజకీయాల్లో వైయస్ దయవల్ల వచ్చానని చెప్పుకొచ్చిన ఆయన పాండిచ్చేరిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు చైర్మన్ గా గెలిచినట్లు ప్రస్తుతం మంత్రిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి 6వ తారీఖున పాండిచ్చేరి రాజకీయానికి స్వస్తి చెపుతూన్నట్లు స్పష్టం చేశారు. దీంతో జగన్ గారు అవకాశం ఇస్తే మొత్తానికి పాండిచ్చేరి నుండి దుకాణం సర్దుకుని ఏపీలో పార్టీకి సేవ చేసుకుంటానని, అవసరమైతే ఇప్పటికిప్పుడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ మల్లాది కృష్ణారావు బీసీ సంక్రాంతి సభలో స్పష్టం చేశారు.