ప్రస్తుతం దేశమంతటా “ఒకే దేశం ఒకే ఎన్నిక” అంటూ జమిలి ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఏక కాలంలో ఎన్నికలు జరిగితే ప్రజాధనం ఆదా అవుతుంది అన్న భావనలో కేంద్రం ఆలోచన చేస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు దాదాపు 60 వేల కోట్లు ఖర్చు అయ్యాయని అంచనా. ఇదిలా ఉండగా చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా జమిలి ఎన్నికలకు మేము సిద్ధమే, పార్లమెంటులో చట్టాలు సవరణలు చేయడమే ఆలస్యం అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఒకే ఓటర్ల జాబితా కి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటువంటి తరుణంలో జమిలి ఎన్నికలు గనుక ఒకవేళ వస్తే ఏపీలో పరిస్థితి ఏంటి అన్న దానిపై వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చిన సమయంలో చాలా రాజకీయ పార్టీలు ప్రజలను మభ్య పెట్టడానికి అనేక జిమ్మిక్కులు చేస్తుంటాయి అని తెలిపారు.
కానీ సీఎం జగన్ ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఒకలాగా గెలిచినా తర్వాత మరొక లాగా కాకుండా రాణిస్తున్నారని పరిపాలన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దాదాపు 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకున్న 90% వాగ్దానాలనూ ఏడాదిన్నర కాలం లోనే అమలు చేసిన ఘనత జగన్ కె సాధ్యమని తెలిపారు. ప్రజలు జగన్ మాటను నమ్ముతున్నట్లు కాబట్టి ఎలాంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని అప్పి రెడ్డి తెలిపారు.