దుబ్బాక ఉప ఎన్నికలలో అధికార పార్టీ టిఆర్ఎస్ బిజెపి పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీ జరిగింది. చివరాకరికి కమలం పార్టీ స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. మెజార్టీని పక్కనపెడితే దుబ్బాక లో గెలుపు ఓటములనే అందరూ విశ్లేషిస్తున్నారు. దుబ్బాక లో గెలిచిన ఊపుతో బిజెపి భవిష్యత్తు ఎన్నికలలో గట్టి పోటీ ఇస్తుంది అనే భావన రాజకీయవర్గాలలో నెలకొంది.
త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జిహెచ్ఎంసి ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య అన్నదానిపై అంచనాలు మొదలయ్యాయి. కాగా దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికల బాధ్యత టిఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి హరీష్ రావు హైకమాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో హరీష్ ఎన్నో కీలకమైన ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలుపు బాట పట్టించారు.
దాంతో దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో కేసీఆర్, కేటీఆర్ గాని దుబ్బాక వైపు వెళ్ళలేదు. ఎక్కువ మంది వెళితే ప్రతిపక్షాలకు సీన్ ఎక్కువ ఇచ్చినట్లు ఉంటుందని భావించి ఇతర మంత్రులను కూడా దుబ్బాక ప్రచారానికి టిఆర్ఎస్ హైకమాండ్ పంపించలేదు. ప్రతిపక్షాలను చాలా తక్కువ అంచనా వేసుకుని కెసిఆర్ ఈ విషయంలో అడుగులు వేశారు. ఈ క్రమంలో పార్టీలో ఓటమి పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చివరి క్షణాలు దుబ్బాక నియోజకవర్గం లో కెసిఆర్ సమావేశం పెట్టి ఉంటే కచ్చితంగా దుబ్బాక లో టిఆర్ఎస్ గెలిచి ఉండేదన చర్చ మొదలైంది. పైగా దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్ సిద్దిపేట నియోజకవర్గం మధ్యలో ఉండటం ఆ నియోజకవర్గంతో కెసిఆర్ కి విడదీయరాని బంధం ఉండటంతో కలిసి వచ్చేది అని అనుకుంటున్నారట. ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. సిద్దిపేట గజ్వేల్ మధ్య దుబ్బాక ఉండటంతో కూడా నష్టం జరిగిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సిద్దిపేట హరీష్ రావు గజ్వేల్ కెసిఆర్ నియోజకవర్గం కావడంతో ఆ ప్రాంతాలలో అభివృద్ధి జరగటంతో దుబ్బాక ప్రజలు కమలం కి మొగ్గుచూపినట్లు సరికొత్త విశ్లేషణలు వస్తున్నాయి.