సూపర్ స్టార్ మహేష్ బాబు వరస సక్సస్ ల తో మంచి ఫాం లో ఉన్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో భారీ కమ్ర్షియల్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరుపుకుంది. మహేష్ కూతురు సితార క్లాప్ కొట్టగా మహేష్ భార్య నమ్రత కెమరా స్విచ్ ఆన్ చేశారు.
కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2021 జనవరి నుంచి ప్రారంభం కాబోతోందని అంటున్నారు. జనవరి లో సంక్రాంతి తర్వాత మొదలు పెట్టి ఏకా ధాటిగా షూటింగ్ జరపనున్నారట. అంతేకాదు కుదిరితే సమ్మర్ కానుకగా సర్కారు వారి పాట సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
కాగా ఎప్పటిలాగే ఈ సారి కూడా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పూజా కార్యక్రమాలకి హాజరు కాలేదు. ఇది మహేష్ సెంటిమెంట్ అని అందరూ చెప్పుకుంటున్నారు. మహేష్ నటించిన గత చిత్రాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాల ఓపెనింగ్స్ కూడా మహేష్ బాబు హాజరవలేదు. ఈ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ని మహేష్ ఫాలో అయ్యాడని చెప్పుకుంటున్నారు.
చాలామంది మహేష్ బాబు సర్కారు వారి పాట ఓపెనింగ్ లో కనిపించలేదని ఫీలయ్యారట. అయితే మహేష్ ఓపెనింగ్ కి వస్తే సక్సస్ ట్రాక్ దెబ్బటుందన్నది కూడా ఒక కారణమని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారట. ఇక మహేష్ కి టైటిల్ విషయంలో కూడా 3 అక్షరాల సెంటినెంట్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎక్కువగా గళ్ళ చొక్కాలు ధరించడానికే ఇష్టపడతాడు మహేష్.