టాలీవుడ్ లో 2020 లో మొత్తంగా సినిమాలన్ని రిలీజ్ కాకండా గడిచిపోయోలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, నాని వి, అనుష్క నిశ్శబ్ధం, రవితేజ క్రాక్, రాం రెడ్ …ఇలా చాలా సినిమాలు రిలీజ్ కావాల్సింది. బాక్సాఫీస్ వద్ద బోలెడంత సందడి నెలకొనాల్సింది. అంతేకాదు సీనియర్ హీరోల సినిమాలు నారప్ప, వైల్డ్ డాగ్, ఆచార్య …ఇలా పెద్ద సినిమాలు పోటీ పడాల్సింది.
కాని కరోనా కారణంగా వీటిలో ఏ ఒక్క సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీగా లేరు. ధైర్యం చేసి రిలీజ్ చేయాలనుకున్నా కూడా థియోట్స్ ఓపెన్ కావాలి. అయినా థియోటర్స్ వరకు వచ్చి చూసేదెవరు. ఇన్ని అనుమానాల మధ్య మేకర్స్ ఇప్పుడు సినిమాలని రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ నుంచి యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమా వరకు అన్ని చిత్రీకరణ మధ్యలోనే అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
అయితే తాజా సమచారం ప్రకారం 2021 సంక్రాతికి యంగ్ హీరోల సినిమాలు రిలీజవుతాయని అంటున్నారు. వాటిలో నితిన్, కీర్తి సురేష్ ల రంగ్ దే, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, శర్వానంద్ నటిస్తున్న శ్రీకారం ..ముఖ్యంగా బరిలో దిగబోతున్నాయట. అలాగే క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ కూడా 2021 సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు ప్లాన్స్ వేస్తున్నారట దర్శక, నిర్మాతలు. మరి ఈ సినిమాలలో బాక్సాఫీస్ లెక్కలు సరిపోతాయ అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు చర్చ జరుగుతుంది.