ఇండియాలో అతి పెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో సక్సస్ ఫుల్ గా మూడు సీజన్ లని కంప్లీట్ చేసుకుంది. త్వరలో నాలుగో సీజన్ కి స్టార్ మా యాజమాన్యం రంగం సిద్దం చేస్తున్నారు. హిందీతో పాటు తమిళంలోను ఈ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
మొదటి సీజన్ కి టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. సీజన్ 1 ..సీజన్ 2 సక్సస్ ఫుల్ కాగా అంతకంటే సక్సస్ ఫుల్ గా సీజన్ 3 సాగింది. సీజన్ 3 కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఇక త్వరలో మొదలవబోయో సీజన్ 4 లో ఇండస్ట్రీతో పాటు బుల్లితెర మీద పాపులారిటీని సాధించిన చాలా మంది ప్రముఖులను పార్టిసిపేట్ చేయించడానికి ‘స్టార్ మా’ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఈ బిగ్ రియాలిటీ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ కి కఠిన నిబంధనలు ఉండనున్నాయట. ముఖ్యంగా హౌస్ లో పాల్గొనడానికి ఎంపికయ్యో కంటెస్టెంట్స్ కి కరోనా టెస్టులు నిర్వహిస్తారట.
అంతేకాదు హౌస్ లోకి వెళ్లబోయే ఈ కంటెస్టెంట్స్ ముందు రెండు వారాలు నిర్వాహకుల పర్యవేక్షణలో ఉండాలట. మళ్ళీ కరోనా టెస్టులు చేసి.. ఎవరికీ పాజిటివ్ లేదని నిర్ధారించుకున్న తరువాత హౌస్ లోకి పంపిస్తారని సమాచారం. ఇక ఈ సీజన్ కి కూడా దాదాపు నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరిస్తాడని అంటున్నారు.
ఇక సీజన్ 4 లో బిత్తిరి సత్తి, యాంకర్ లాస్య, వర్షిణి, ప్రముఖ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక గత సీజన్ నిర్వహించిన బిగ్ హౌజ్ లోనే ఈ సీజన్ 4 కూడా నిర్వహించబోతున్నారట. ప్రస్తుతం హౌజ్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట. ఆగస్ట్ ఆఖరు వారం నుంచి బిగ్ బాస్ సీజన్ 4 మొదలవనుందని తెలుస్తుంది.