పవన్ కళ్యాణ్ – రానా సినిమా మొదలవ్వాలంటే సాయి పల్లవి రావాలి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. పవర్ స్టార్ pawan kalyan టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో నటించబోతున్నసంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నారు.
కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. త్రివిక్రం – థమన్ కాంబినేషన్ మళ్ళీ రిపీటవుతోంది. ప్రస్తుతం pawan kalyan క్రిష్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తీ నిర్మిస్తున్నాడు. అయితే వాస్తవంగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ayyappanum koshiyum తెలుగు రీమేక్ మొదలవ్వాల్సి ఉండగా బ్రేక్ పడి క్రిష్ సినిమా సెట్స్ మీదకి వచ్చింది.
అయితే సాయి పల్లవి డేట్స్ సర్ధుబాటు కాకపోవడం వల్లే అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ షూటింగ్ పెండింగ్ పడిందని సమాచారం. ప్రస్తుతం sai pallavi వరసగా సినిమాలు చేస్తోది. దాంతో అనూహ్యంగా ఒకే అయిన అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ కి డేట్స్ క్లాష్ అవుతున్నాయట. ఒక్కసారి గనక సాయి పల్లవి డేట్స్ అడ్జెస్ట్ అయితే అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ సెట్స్ మీదకి వచ్చేస్తుంది. అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ సినిమాని సమాంతరంగా చేయబోతున్నాడు pawan kalyan.