యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత మూడు భారీ పాన్ ఇండియన్ సినిమాలని ప్రకటించాడు. అందులో ఒకటి రాధే శ్యామ్, రెండవది వైజయంతీ మూవీస్ నిర్మించే నాగ్ శ్విన్ – ప్రభాస్ సినిమా, మూడవ సినిమా బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్. ప్రస్తుతం రాధేశ్యామ్ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చిన రాధేశ్యామ్ టీం క్లైమాక్స్ సీన్స్ కోసం భారీ సెట్ లో చిత్రీకరణ కి సిద్దమవుతున్నారు. ఈ షెడ్యూల్ తో రాధేశ్యామ్ దాదాపు కంప్లీట్ అవుతుందట.
దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ని పట్టాలెక్కించడానికి సిద్దమవుతున్నాడని అంటున్నారు. అయితే అందరి లెక్క ప్రకారం రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ చేయాల్సిన సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించే సినిమా. కాని ఇప్పుడు ఆర్డర్ మారిందని అంటున్నారు. ఇలా మారిన సంగతి బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించబోయో ఆదిపురుష్ సినిమా ని ప్రకటించినప్పటి నుంచే అంటున్నారు. కాని ఫ్యాన్స్ మాత్రం ఒక ఆర్డర్ లోనే ప్రభాస్ సినిమాలని ఊహించుకుంటున్నారు.
అయితే నాగ్ అశ్విన్ సినిమా కంటే ఆదిపురుష్ ముందు మొదలు పెట్టడానికి కారణాలున్నాయట. ఈ సినిమా 3డి లో తెరకెక్కించనున్నారు కాబట్టి ఎక్కువగా కంప్యూటర్ గ్రాఫిక్స్ కి సమయం పడుతుందన్న కారణంగా ఆదిపురుష్ ని ముందు మొదలు పెడుతున్నారట. అదీ కాక నాగ్ అశ్విన్ సినిమాకి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదని సమాచారం. ఆ వర్క్ అవడానికి ఇంకా సమయం పడుతుందని ఈ లోపు ఆదిపురుష్ షూటింగ్ కొంత ఫినిష్ చేద్దామని ప్రభాస్ డిసైడయ్యాడట. ప్రభాస్ మాత్రం పక్కా క్లారిటీగా ఉన్నాడు. కాని ఫ్యాన్సే అనసవరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారట. ఏదేమైనా డార్లింగ్ తన సినిమాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు కదా.