ప్రియమణి.. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో వరసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. పెళ్ళికి ముందు ప్రియమణి సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తమిళంలో నటించిన పరుత్తి వీరన్ సినిమాకి నేషనల్ అవార్డ్ ని సొంతం చేసుకున్న priyamani మంచి కమర్షియల్ హిట్ సినిమాలకి ఒక దశలో కేరాఫ్ అడ్రస్ గా మారింది. హీరోయిన్ గా బిజీ బిజీగా గా ఉన్నప్పుడే ముస్తపారాజ్ని పెళ్ళి చేసుకుంది. కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్న priyamani… కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉంది. అయితే బుల్లితెరమీద మాత్రం సందడి చేస్తూ ప్రేక్షకులకు చేరువలోనే ఉంది.
priyamani లో ఇప్పటికీ అదే అందం అదే గ్లామర్ తో మేకర్స్ ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బుల్లితెర మీద ఢీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రియమణి పిచ్చ హాట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక పెళ్ళి తర్వాత కథా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించడానికి అలాగే గ్లామర్ పాత్రల్లో కనిపించడాని రెడీగా ఉంది. ఇప్పటికే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంతో priyamani కీలక పాత్ర పోషిస్తోంది. ఇక రెండు తెలుగు సినిమాలలోనూ నటిస్తోంది.
వెంకటేష్ హీరోగా నారప్ప సినిమా చేస్తుండగా… శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ సినిమాతో పాటే రానా దగ్గుబాటి తో priyamani విరాట పర్వం అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి ‘కామ్రేడ్ భరతక్క’ పాత్రలో కనిపించబోతోంది. ఇలా రీ ఎంట్రీ సినిమాలలో మంచి అవకాశాలను అందుకుంటున్న priyamani ఇప్పుడు గ్లామర్ రోల్స్ లో నటించేందుకు సై అంటోందట. ఇక సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ లో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో priyamani సీనియర్ హీరోలకి పర్ఫెక్ట్ జోడీ అని అంటున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాలో ప్రియమణి నటించబోతుందన్న ప్రచారం జరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?