సాహో లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత లాంగ్ గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యామ్” రాకకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులోను చాలా కాలం తర్వాత ప్రభాస్ కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తుండటం కూడా ముఖ్యం కారణం. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్.. ప్రభాస్ – పూజా ది డ్యూయల్ రోల్ అన్న టాక్.. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కావడం.. ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకుల్లో ఉత్కంఠతని రేకెత్తిస్తున్నాయి.
జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని అంటున్నారు. ఇటీవలే “రాధే శ్యామ్” ఇటలీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొని ఇండియాకి చేరుకున్నారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని ఫిల్మ్ సిటీలో కంప్లీట్ చేస్తారని అంటున్నారు. అయితే దాదాపు చిత్రీకరణ కంప్లీట్ కావచ్చింది. సంక్రాంతికి ఇంకా దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది కాబట్టి మేకర్స్ తలుచుకుంటే అప్పటి వరకు “రాధే శ్యామ్” రిలీజ్ కి రెడీ చేసేయొచ్చు అంటున్నారు.
మేకర్స్ కూడా ఇదే ఆలోచిస్తున్నారట. అన్ని అనుకున్నట్టు కంప్లీట్ అయితే 2021 సంక్రాంతి బరిలో దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. కాని ఇంత భారీ బడ్జెట్ సినిమాని ఇలాంటి పరిస్థితుల్లో మొండి ధైర్యం చేసి రిలీజ్ చేయడం పెద్ద సాహసం అంటున్నారు. అసలు ఆలోచన కూడా సరైనది కాదన్న మాట వినిపిస్తోంది.
వాస్తవంగా అయితే ఇంకా కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగలేదు. సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో కూడా ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. సాధారణ జనం తమ పొట్టకూటి కోసం పనులు చేసుకునేందుకు బయట తిరుగుతున్నప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో రెండున్నర గంట థియోటర్స్ లో కూర్చోవడం అంటే ఇంకా భయాడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో “రాధే శ్యామ్” రిలీజ్ చేసి పెట్టిన పెట్టుబడి రాబట్టడం అసాధ్యం అంటున్నారు. కరోనా వల్ల ఇప్పటికే కొంత బడ్జెట్ కూడా వేస్ట్ అయిందని ప్రచారం కూడా జరిగింది. మరి మేకర్స్ ఏం డిసైడవుతారో చూడాలి.