Radheshyam : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే ఒప్పుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మార్కెట్ ఇప్పుడు ఏ తెలుగు హీరోకి లేదు. తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్లో ఉన్న హీరోలకి లేదని చెప్పాలి. ప్రభాస్ తో ధూమ్ 4 చేయాలని బాలీవుడ్ నిర్మాతలు ఎన్నో సార్లు భారీ ఆఫర్ ఇచ్చారు. కానీ ప్రభాస్ వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఆదుపురుష్ తర్వాత ఈ సినిమా గురించి ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయట. ఇక హాలీవుడ్ స్క్రిప్ట్ తో సినిమా చేయాలని కొంతమంది అప్రోచ్ అవుతున్నారు.
అయితే ఇక్కడ కమిటయిన మూడు పాన్ ఇండియన్ సినిమాలు ముందు పూర్తి చేయాలని ప్రభాస్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అన్ని సవ్యంగా జరిగితే జూలై 30 న ప్రభాస్ – రాధాకృష్ణ – పూజా హెగ్డేల రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ చోట్లా భారీ లెవల్ లో విడుదల చేద్దామనుకున్నారు. ఇప్పుడు ఆ సూచనలు కనిపించడం లేదంటున్నారు. సలార్ తో సెట్స్ మీదకి త్వరలో వస్తాడట ప్రభాస్. అలాగే ఆది పురుష్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కి ప్లాన్ చేశారు. అక్కడ నాన్ స్టాప్ గా షూటింగ్ చేయనున్నారు. ఈ రెండు రిలీజ్ డేట్ 2022లో అని వెల్లడించారు.
Radheshyam : రాధే శ్యామ్ ఓటీటీ రిలీజ్ అని ప్రచారం జరుగుతుంది.
అందులో భాగంగా రాధే శ్యామ్ ఓటీటీ రిలీజ్ అని ప్రచారం జరుగుతుంది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ వారు భారీ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. కానీ ప్రభాస్ సినిమా ఓటీటీలో అంటే నిర్మాతలకి లాభాలా..నష్టాలా అనేది ఇప్పుడు చర్చ సాగుతోంది. థియేటర్స్ లో అయితే రికార్డుల మోత వేరు. ఇక్కడ అది ఉండదనే టాక్ వినిపిస్తోంది. పైగా నిర్మాతలు 250 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ మొత్తం రావాలంటే విదేశాలలో అయినా కనీసం థియేటర్స్ రిలీజ్ కావాలి. వకీల్ సాబ్ రిలీజై నష్టాలతో ముగిసింది. మరి రాధే శ్యామ్ పరిస్థితేంటో త్వరలో ఓటీటీ రిలీజ్ అంటే ..నిజంగా ఓటీటీలో రిలీజయితే గానీ తేలిపోతుంది.