ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ భారీ మల్టీస్టారర్ కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ శక్తి వంతమైన పోరాట యోధులుగా నటిస్తున్నారు. కాగా ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన తారక్, చరణ్ ల టీజర్స్ ప్రతీ ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కాగా కరోనా కారణంగా షూటింగ్ లేట్ అవడంతో ముందుగా చెప్పినట్లు 2021 సంక్రాంతికి విడుదల చేయలేకపోతున్నామని రాజమౌళి బృందం వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో అన్నీ జాగ్రత్తలు తీసుకొని తిరిగి షూటింగ్ ప్రారంభించిన రాజమౌళి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. యూనిట్ మొత్తం రెస్ట్ లేకుండా రాత్రి పగలు కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి.. మహాబలేశ్వర్ లో కూడా రెండు రోజుల షెడ్యూల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మహాబలేశ్వర్ షూట్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం.
ఇక నెక్స్ట్ షెడ్యూల్ కూడా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మొదలు పెట్టబోతున్నారు. కాగా ఈ షెడ్యూల్ లో చరణ్ కి జంటగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ తాజా షెడ్యూల్ లో పాల్గొనబోతోందని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం 2021 మార్చి వరకు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రీకరణ కంప్లీట్ చేయాలని రాజమౌళి బృందం శ్రమిస్తున్నారు. నిజంగా అనుకున్న ప్రకారం మార్చ్ వరకు షూటింగ్ కంప్లీటయితే తారక్, చరణ్ నెక్స్ట్ మూవీస్ ని మొదలు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్టార్స్ ఇద్దరు అదే ప్లాన్ లో ఉన్నట్టు కూడా చెప్పుకుంటున్నారు.