రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్. గిల్లి అన్న కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయమైన రకుల్ ఆ తర్వాత కెరటం సినిమాతో టాలీవుడ్ సినిమాలోకి ఎంటరైంది. అయితే యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో బాగా పాపులర్ అయి వరసగా తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, సాయి ధరం తేజ్, నాగ చైతన్య, గోపీచంద్ ..ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలలోను నటించి బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు నాలుగేళ్ళ పాటు టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకొని హాట్ టాపిక్ గా నిలిచింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక కోలీవుడ్ లో కూడా సూర్య, కార్తి, గౌతం కార్తీక్ లాంటి హీరోలతో నటించి తమిళ చిత్ర పరిశ్రమలోను హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకుంది.
అలాగే బాలీవుడ్ లో అయ్యారే సినిమాతో అడుగుపెట్టిన రకుల్ సీనియర్ స్టార్స్ అజయ్ దేవగన్, టబులతో కలిసి దే దే ప్యార్ దే సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫాం లో ఉన్న రకుల్ కి టాలీవుడ్ లో నటించిన మన్మధుడు 2 డిజాస్టర్ గా నిలిచి దెబ్బకొట్టింది. దాంతో రకుల్ కి తెలుగులో మళ్ళీ అవకాశాలు రాలేదు. అంతే ఇక రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ క్లోజ్ అన్న టాక్ మొదలైంది.
తెలుగులో పట్టించుకోవడం లేదని అందుకే తమిళ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెడితే బెటర్ అని రకుల్ భావిస్తుందట. ఈ విషయంలో నయనతార ని ఫాలో అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. నయనతార కూడా తెలుగు లో ఓ వెలుగు వెలిగి తమిళ్ లోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే నయనతార లా రకుల్ కి లక్ కలిసొస్తుందా అన్న అభిప్రాయాలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రస్తుతానికైతే తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2, ఒక హిందీ సినిమా, ఒక తమిళ సినిమా చేస్తుంది.