తేజ దర్శకత్వంలో మాస్ అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ ఒక సినిమా చేయబోతున్నాడు. గతంలో ఒకే ఒక్క సినిమా చేసి కనుమరుగై పోయిన గోపీచంద్ ని మళ్ళీ అవకాశం ఇచ్చి స్టార్ ని చేసింది తేజ అన్న సంగతి తెలిసిందే. అప్పుడు విలన్ గా అవకాశం ఇచ్చిన తేజ ఇప్పుడు హీరోగా ‘అలిమేలుమంగ వేంకటరమణ’ సినిమాని తెరకెక్కించబోతున్నాడు.
ఇక తేజ .. గోపీచంద్ మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా భారీ యాక్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. తేజ కథ ని ఎంత పక్కాగా రాస్తాడో అంత పక్కాగా తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన రానా దగ్గుబాటి తో తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఈ క్రమంలోనే గోపీచంద్ తేజ కాంబినేషన్ లో తెరకెక్కబోయో సినిమా మీద భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకి వెళ్ళే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమాలో అలిమేలు మంగ పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తుంది. అదే గనక నిజమైతే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ లో హిట్ పడటం ఖాయమని అంటున్నారు.
గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ‘సీటీమార్’ చేస్తోన్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా సక్సస్ మీద గోపీచంద్ తో పాటు సంపత్ నంది చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.