పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వచ్చింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. శ్రీవిష్ణు – నారా రోహిత్ లతో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా ని తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాగర్ కె.చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. కాగా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాలో బిజూ మీనన్ – పృథ్వీరాజ్ పోటా పోటీగా నటించారు.
అందుకే ఈ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఎవరు నటిస్తారని. అయితే అఫీషియల్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్టు ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరగడం తో పాటు మరో హీరో ఎవరు అన్న ఆసక్తి అందరిలోను పెరిగింది. కాగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రధానంగా రానా పేరు వినిపిస్తోంది.
బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఇక పవన్ తో పాటు నటించే మరో హీరో విషయంలో రక రకాల రూమర్స్ వస్తున్నాయి. కాని తాజాగా ఈ పాత్ర కి సంబంధించి మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే మేయిన్ హీరోగా ఉండేలా ఒరిజినల్ కథలో మార్పులు చేసినట్టు సమాచారం. మరో హీరో కాకుండా ప్రధాన ప్రతినాయకుడి పాత్రగా రెండవ హీరో క్యారెక్టర్ ని మార్చినట్టు చెప్పుకుంటున్నారు.
మరి ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియనప్పటికి ఇలా ఒరిజినల్ కథ లో ఇలాంటి భారీ మార్పు అంటే సినిమా కథ లో వేయిట్ తగ్గుతుందేమే అన్న సందేహాలు కలుగుతున్నాయట. కాగా మాటల మాంత్రూకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా డైలాగ్స్ అందిస్తున్నాడని సమాచారం. థమన్ సంగీతమందిస్తున్నాడు. 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.