గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున గ్రేటర్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న మంత్రి కేటీఆర్ తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి విషయంలోకి వెళితే వరదల సాయం విషయంలో ప్రతిపక్షాలు లెటర్ రాయడం వల్ల బాధితులకు డబ్బులు ఆగిపోయినట్లు పేర్కొన్నారు కేటీఆర్. ఈ విషయాన్ని స్వయంగా బిజెపి నూతన ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పినట్లు తెలిపారు. మరోపక్క బండి సంజయ్ నిధులు ఆపాలంటూ రాసిన లెటర్ తనది కాదని ఫోర్జరీ అంటూ మాట్లాడటం హాస్యాస్పదమని కేటీఆర్ పేర్కొన్నారు.
నిజంగా ప్రజల పై బిజెపి నేతలకు ప్రేమ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది వారే కదా ఎన్నికల కంటే ముందే ప్రతి బాధితుడు అకౌంట్లో ఇస్తామంటున్న 25,000 ఇప్పుడే వేయచ్చు కదా అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ రాసి 8 వారాలు అయింది అయినా కానీ కేంద్రంలో స్పందన లేదని కేటీఆర్ మండిపడ్డారు. వరద బాధితులను ఆరున్నర లక్షల మందికి టిఆర్ఎస్ ప్రభుత్వం పది వేలు ఇస్తామని ప్రకటించిందో, వారికందరికీ కేంద్ర ప్రభుత్వం ముందే పాతిక వేలు ఇస్తే నిజంగా ప్రధాని మోడీ కి చేతులెత్తి మొక్కుతా అని కృతజ్ఞతలు తెలుపుతా, మేము కూడా ప్రధాని మోడీ ని పొగుడుతాం అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.