Acharya : ‘ఆచార్య’.. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబాయే వాటిలో మోస్ట్ అవైటెడ్ సినిమా. సైరా తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరొక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
కాగా ఆచార్య సినిమా దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల నేపథ్యంలో రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్స్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక టీజర్లోనే ఈ సినిమా కథ చెప్పేసాడు కొరటాల. ఆచార్య సినిమాతో మరోసారి భారీ హిట్ కొట్టాలని.. మెగాస్టార్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, అందరు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ.
Acharya : ఆచార్య సినిమా నుంచి ఇలా లీకులు వస్తే ..?
అయితే ఈ సినిమా నుంచి వరసగా ఇటీవల లొకేషన్లో నుంచి పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో మెగా ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారట. అయ్యయ్యో ఆచార్య సినిమా నుంచి ఇలా లీకులు వస్తే కథ మొత్తం తెలిసిపోయో అవకాశం ఉంది కదా అంటూ చెప్పుకుంటున్నారట. మరి ఈ లీకులు ఎలా వస్తున్నాయో తెలీదు గాని మేకర్స్ కి ఒకవైపు పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. చూడాలి మరి ఈ విషయంలో మేకర్స్ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా. ఇక ఈ సినిమా మే 13న దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?