సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా విజయ్ దేవరకొండ అత్యంత సన్నిహితుడు కేదార్ సెలగం శెట్టి నిర్మించనున్నాడు. ఫస్ట్ టైం నిర్మాతగా విజయ్ తో సినిమా నిర్మిస్తుండటంతో భారీ బడ్జెట్ నే కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో రూపొందించబోతుండగా 2022 లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. అంతేకాదు అదే ఏడాది రిలీజ్ కూడా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
కాని ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్లాన్స్ మారినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2021 ఆగస్ట్ లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 5 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి కంప్లీట్ అయితే సుక్కు-విజయ్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఇప్పటికే సుకుమార్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమా కథా నేపథ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. సుకుమార్ ఈ సినిమాని కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇండియా – పాకిస్తాన్ విడిపోయిన కాలంలో జరిగిన యుద్ధం నేపథ్యాన్ని తీసుకుని సుక్కు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా స్క్రిప్ట్ సిద్దం చేశాడని ప్రచారం అవుతోంది. కాగా ఇప్పుడు ఒక డిజాజార్డర్ తో బాధపడే యువకుడిగా కనిపించబోతున్నాడని ప్రచారం మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది క్లారిటీ లేనప్పటికి ఈ పాయింట్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. నిజంగా అలాంటి క్యారెక్టర్ గనక ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు.