Gaya: మన కుటుంబం లో ఎవరైనా మరణించినప్పుడు మనం ఇంట్లో ఆబ్దికాలు పెట్టే సందర్భంగా గయ..గయ..గయ (Gaya) అని మూడుసార్లు అంటాము. దాని అర్థం ఇక్కడ పెడుతున్న శ్రాద్ధం గయ లో పెట్టినట్లుగా భావిస్తాము.పేరే అంత పవిత్రమైనది అయితే గయలో పిండప్రదానం మరింత గొప్పది అని చెప్పాలి.
Gaya: పితృ దేవతలకు ఆహారం నీళ్లు
చనిపోయిన వారికి గయ లో కానీ ,కాశీ లో (Kasi) కానీ , బ్రహ్మ కాపాలము లాంటి పుణ్య తీర్ధాల లో పిండప్రదానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది .అక్కడ పెట్టిన శ్రాద్ధ ఫలితాన్ని బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వర దేవతలు ఆ శ్రాద్ధ ఫలితాన్ని పితృదేవతలకు అందజేస్తారు అంటే ఇందులో ఎటువంటి సందేహం లేదు.అక్కడ పెట్టినంత మాత్రన ఇక ఆబ్దికాలు పెట్టక్కరలేదు అన్నది మన భావనే తప్ప శాస్త్రాలలో ఎక్కడ అలా చెప్పబడలేదు.పిండప్రదానం వలన పితృ దేవతలకు ఆహారం నీళ్లు అందిస్తున్నట్టు.. ఏదైనా గొప్ప ఫంక్షన్ కి వెళ్లి భోజనం చేసి వచ్చి ఇంక ఆహారం తీసుకోవడం మానేస్తున్నారా?లేదు కదా!ఇది కూడా అలాంటిదే. ఐతే మీకు అనుకోని అవాంతరాలు ఏదైనా వచ్చి ఆబ్దికం పెట్టలేక పోతే మాత్రం పితృ కార్యం చేయని దోషాన్ని గయా శ్రాద్ధం రాకుండా చేస్తుంది. మేము గయలో పిండ ప్రదానం చేసాము కాబట్టి ఇక తద్దినాలు పెట్టక పోయిన పరవాలేదు అన్న అమాయకత్వంతో పితృకార్యాలు చేయక పోవడం తప్పు.దాని వల్ల పితృ దోషాలు అనుభవించాల్సి వస్తుంది.
ఒక్కసారి ఆలోచించండి
మనకు ఈ జన్మనిచ్చి ,తాను తినకున్నా మన కడుపు నిండేలా చేయడం తో పాటు ,విద్యాబుద్ధులు నేర్పి, ప్రయోజకులుగా తయారు చేసి ప్రతి నిమిషం మన కోసమే తమ జీవితాన్ని త్యాగం చేసిన పితృదేవతలకు సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టడం భారమా ఒక్కసారి ఆలోచించండి. ఏ క్షేత్రంలో పిండ ప్రధానాలు చేసిన కూడా , మనం జీవించి ఉన్నంత వరకు కచ్చితంగా ఆబ్దికం చేసి , పిండ ప్రధానం చేయవలసిందే. ఇందులో అసలు సందేహం పెట్టు కోకూడదు.