దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లతో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా రౌద్రం రణం రుథిరం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్..ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండి కరోనా కారణంగా ఆగి పోయిన సినిమాలలో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, ప్రభాస్ – రాధాకృష్ణ ల ‘రాధే శ్యామ్’ మెగాస్టార్ – కొరటాల శివ ల ‘ఆచార్య’ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తయారవుతున్న ‘పుష్ప’ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీటిలో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం టాకీ పార్ట్ కంప్లీట్ అయింది.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు కారణాలు, అవాంతరాల వల్ల ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే పెరుగుతూ వచ్చిందని ప్రచారం అవుతుంది. కాగా మిగిలి ఉన్న చిత్రీకరణకి.. ఇతర వ్యవహారాలకి మరో 100 బడ్జెట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి దానయ్య ఈ విషయంలో ఎలా ఆలోచిస్తారో చూడాలి. కాని రాజమౌళి మీద నమ్మకంతో ఎంతైనా ఖర్చు చేస్తాడని చెప్పుకుంటున్నారు.