Children: పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిదేనా ? దోషాలు ఉన్నాయా ? శాంతి అవసరమా ? అనే సందేహం ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది అశ్విని నక్షత్రం 1 వ పాదములో పిల్లలు పుడితే దోషం తండ్రి కి ఉంటుంది. ఈ దోషము ౩ నెలలు వరకు ఉంటుంది. ఇక్కడ గమనించ వలసిన విషయం రేవతి, అశ్విని నక్షత్రం ల మధ్య సుమారు 48 నిమిషాల పాటు సంధి కాలం ఉంటుంది. ఈ సమయం లో పుట్టిన పిల్లలకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది అని చెప్పబడింది.
Children: 2 , 3 , 4 లో పుట్టిన వారికి దోషం లేదు.
భరణీ 1, 2, 4 పాదములో పుట్టిన పిల్లలకు దోషము లేదు. 3 వ పాదము లో పాప పుడితే తల్లికి, బాబు పుడితే తండ్రికి దోషం వస్తుంది. ఈ దోషము 23 రోజుల వరకు ఉంటుంది.
కృత్తిక నక్షత్రంలో 1, 2, 4 పాదములో పుట్టిన పిల్లల వలన తల్లిదండ్రులకు, స్వల్ప దోషం ఉంటుంది.మూడోవ వ పాదము లో పుట్టిన పాప తో తల్లికి, బాబు తో తండ్రి కి సామాన్య దోషం కలుగుతుంది.
రోహిణి నక్షత్రము 1 వ పాదములో పుట్టిన పిల్లల వలన మేనమామకు, 2 వ పాదము లో తండ్రి కి ,3 వ పాదము లో అమ్మకు దోషమని,నాల్గవ వ పాదం దోషం లేదని కొందరు అంటుంటారు. అసలు ఈ నక్షత్రంలో పుట్టిన వారి వలన మేనమామ గండం ఉంటుంది.కాబట్టి తప్పక శాంతి చేసుకోవాలి. శ్రీ కృష్ణ పరమాత్మ జననం ఈ నక్షత్రం లో జరిగింది. మేనమామ గండము లో పుట్టాడు. ఈ కారణం తోనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణం తెలియచేస్తుంది.
మృగశిర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములలో దేనిలో పుట్టిన కూడా వారికి ఎటువంటి దోషాలు ఉండవు.
ఆరుద్ర 1, 2, 3 పాదంలో పుట్టిన వారికి దోషం ఉండదు. 4 వ పాదంలో పుడితే సామాన్య శాంతి చేసుకోవాల్సి ఉంటుంది.
పునర్వసు నక్షత్రం పాదములు అన్నీ మంచివే. కాబట్టి ఏ పాదం లో పుట్టిన కూడా ఏ విధమైన శాంతి చేసుకోవలసిన అవసరం ఉండదు.కొన్ని సార్లు నక్షత్రం లో సమస్య లేకపోయినా కూడా దుష్ట తిధి దోషం ఉండటం వలన , వర్జ్యము ఉండుట వలన , దుర్ముహూర్త కాలము ఐన , గ్రహణ సమయం లో పుట్టిన వారికి శాంతి చేయించుట తప్పనిసరి.