సీజన్ ఫోర్ లో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ లు ప్రస్తుతం సెలబ్రిటీలు గా బయట చలామణి అవుతున్నారు. గతంలో రాణిచీనా విధంగా ఈ సారి కంటెస్టెంట్ లకు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు వైల్డ్ కార్డు తో కలిపి 19మంది ఎంట్రీ ఇవ్వగా కేవలం కొద్దిమంది మాత్రమే క్లిక్ అయ్యారు. ఎక్కువగా టాప్ ఫైవ్ లో అదేవిధంగా ఫ్రెండ్షిప్ లవ్ ట్రాక్ అన్న తరహాలో హౌస్ లో క్రియేట్ అయిన వాతావరణం బట్టి ఆ కంటెస్టెంట్ లు బయట ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ అనుభవాలు పంచుకుంటున్నారు.
ముఖ్యంగా హౌస్ లో ఫ్రెండ్షిప్ అనే విషయానికి వస్తే సోహెల్, మెహబూబ్, అఖిల్ ఎప్పుడూ ఒకే చోట ఉండే వాళ్ళు. చివరిలో మెహబూబ్ కి అఖిల్ కి కొద్దిగా ట్రాష్ వచ్చినా గానీ.. వాళ్ల బాండింగ్ కి బయట మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చికెన్, మటన్ మటన్ చికెన్ అని వీళ్ళు వేసిన డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది.
ఇదిలా ఉండగా ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ లో సోహెల్, మెహబూబ్ ఇంటర్వ్యూ లో పాల్గొని బిగ్ బాస్ హౌస్ లో అనేక అనుభవాలు గురించి చెప్పుకొచ్చారు. జూనియర్ మాట్లాడుతూ జీవితంలో అమ్మాయిల గురించి ఎప్పుడూ గొడవ పడలేదని తెలిపాడు. ఫ్రెండ్స్ విషయంలో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని సోషల్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఐ ఫీస్ట్ లాంటి సబ్జెక్టు దొరికితే అఖిల్, మెహబూబ్ తో కలసి సినిమా చేస్తానంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.