టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఖచ్చితంగా ఈ డైరెక్టర్ తో ఒక సినిమా చేయాలని అనుకునేది వివి వినాయక్ తో. మాస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గాని ప్రేక్షకుల్లో గాని విపరీతమైన క్రేజ్ ఉన్న దర్శకుడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరీర్ లో ఆది సినిమాతో భారీ సక్సస్ ఇచ్చాడు. ఆ తర్వాత బాలయ్య కి చెన్నకేశవరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కి ఠాగూర్ లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు. అందుకే మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాకి వినాయక్ నే ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
వివి.వినాయక్ జోరు గత కొంతకాలంగా బాగా తగ్గింది. ఆ మధ్య అఖిల్ డెబ్యూ సినిమా డైరెక్ట్ చేశాడు. కాని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం మెగాస్టార్ తో హ్యాట్రిక్ సినిమా చేయబోతున్నాడు. మలయళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు మెగాస్టార్, రాం చరణ్ వినాయక్ కి అప్పగించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
అయితే ఎప్పటి నుంచో వినాయక్ కి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. కాని ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు. కాని ఖచ్చితంగా ఈ ఇద్దరి తో సినిమా చేస్తాడని మాత్రం తెలుస్తుంది. అందుకే రెగ్యూలర్ గా ఈ ఇద్దరి స్టార్ హీరోలతో టచ్ లో ఉన్నాడట వినాయక్. చూడాలి మరి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో నిర్మించే సినిమాకి ఇంకా దర్శకుడిని నిర్ణయించలేదు. బహుషా ఆ ఛాన్స్ వినాయక్ కి రావచ్చేమో.