బిగ్ బాస్ షో సీజన్ ఫోర్ తెలుగు లో ఏడవ వారం లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో పై తాజాగా విమర్శలు ఎక్కువయ్యాయి. ఎలిమినేషన్ విషయంలో ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు తమ స్క్రిప్ట్ పరంగా ఎలిమినేషన్ చేస్తున్నట్లు బయట జనాలు తెగ డిస్కషన్లు చేస్తున్నారు. టిఆర్పి రేటింగ్ ల కోసం ఆడియన్స్ ని మోసం చేయటం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరో వారం కుమార్ ఎలిమినేషన్ ప్రక్రియపై ఫైర్ అవుతున్నారు
పూర్తి విషయంలోకి వెళితే ఆరవ వారంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి ముక్కుసూటిగా గేమ్ ఆడే వాడు అని.. పైగా ఓట్లు కుమార్ కంటే తక్కువ మోనాల్ కే వచ్చి ఉంటాయని, కానీ కుమార్ సాయిని ఎలిమినేట్ చేయడం దారుణమని చర్చించుకుంటున్నారు.
తమ టిఆర్పి రేటింగ్ కోసం ఆడియన్స్ ఓటింగ్ వేసిన వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఇంకెందుకు ఈ షో అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే ఓటింగ్ వేయటం కష్టం… మీ స్క్రిప్టు పరంగా సీరియల్ లాగా ప్రసారం చేస్తే బాగుంటుంది. దానికి ఆడియన్స్ ఓటింగ్ అడగటం నిజంగా మోసం చేయడమే అన్న తరహాలో సోషల్ మీడియాలో నెటిజన్లు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియపై ఫైర్ అవుతున్నారు. ఇదేవిధంగా టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి విషయంలో కూడా జరిగిందని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ షో నిర్వాహకులు హౌస్ లో యదార్ధంగా ఆడేవారిని, ప్రేక్షకులకు నచ్చే వారిని తమ స్క్రిప్టు పరంగా ఎలిమినేట్ చేస్తున్నారు అనే విమర్శలు బయట వస్తున్నాయి.