టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయ ప్రముఖులు సినిమాలు తీయటంలో కాంట్రవర్సీ చేయటంలో సిద్ధహస్తులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని చాలామంది చెబుతారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, రక్త చరిత్ర, వంగవీటి, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాలు చేసి సంచలనం సృష్టించారు. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో అనేక వివాదాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది.
ఈ విషయం పక్కనపెడితే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి నాయకుడు బండారు సత్యనారాయణ తాజాగా ఏపీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పై సినిమా తీయాలని, ఈ సినిమా కనుక రాంగోపాల్ వర్మ తీస్తే జగన్ పాత్ర చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు. జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అంతా అవినీతి అంటూ చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇటువంటి అవినీతి కార్యక్రమాన్ని ఆర్జివి సినిమా రూపంలో చేస్తే బాగుంటుందని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాలు అంటూ వైసిపి నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని బండారు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. ఒక ఇళ్లస్థలాలు కార్యక్రమం మాత్రమే కాక రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అనేక అవినీతికి పాల్పడుతున్నట్లు వాటన్నిటిపై సినిమా చేయాలని అన్నట్టుగా బండారు ఇటీవల కామెంట్లు చేయడం జరిగింది.