మొన్నటి వరకు నివార్ ఇప్పుడు బురేవి తుపాను ఏపీని వణికిస్తోంది. దీని ప్రభావం వాల్ల ఇప్పటికే దక్షిణ కోస్తా మరియు రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి శ్రీవారి ఆలయ ప్రాంతం,రోడ్లు, మాడవీధులు, పార్కులు, కాటేజీలు జలమయమయ్యాయి.
ఫలితంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నివర్ తుపాను దెబ్బకు ఘాట్ రోడ్డులోని భారీ వృక్షాలు, కొండచరియలు విరిగిపడంతో ఈ సారి అధికారులు ముందుగానే అప్రమత్తమై కొండచరియలు, భారీ వృక్షాలు ఉన్నచోట నిఘా పెట్టి రక్షణ బలగాలను పెంచారు.
తుపాను కారణంగా తిరుమలలోని జలాశయాలు నిండినందున అధికారులు పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను ఎత్తారు. గురువారం సాయంత్రానికి తమిళనాడులోని పంబన్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను శుక్రవారం ఉదయం తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెబుతుంది.