చాలా మంది తమకు నిద్ర అందనంత దూరం లో ఉంది అంటారు .మరి కొందరు నిద్ర రప్పించడం కోసం నిద్రమాత్రలు వాడుతున్నామంటారు. నిజానికి అది చాలా ప్రమాదకరం. దీనికి కారణం టెన్షన్లు, ఒత్తిళ్లు, సోషల్ మీడియా గాసిప్లు, రణగొణ ధ్వనులు… ఇలా ఎన్నో అంశాలు నిద్రను దూరం చేస్తున్నాయి.
పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ నిద్రలేమి సమస్యను అనుభవిస్తున్నారు. నగరాల్లో జీవనం సాగించే వారిలో ప్రతి పది మందిలో ఒకరు నిద్రలేమి సమస్య తో బాధ పడుతున్నారని మానసిక నిపుణులు తెలియచేస్తున్నారు .ఒక అధ్యయనం లో నిద్రలేమి ఉన్న వారిలో అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలింది. తక్కువగా నిద్ర పోవడం వలన గుండె నొప్పి, స్ట్రోక్, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు ఎక్కువగా వస్తాయి. రక్త పోటు,డయాబెటిస్ వంటి సమస్యలు కూడా నిద్ర సరిపోకపోవడం వలన వచ్చే అవకాశం ఉంది.
ఈ సమస్య తో బాధ పడేవారి లో ఎక్కువగా చిరాకు ,కోపం ,విసుగు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు నిద్రలేమి సమస్య వలన జ్ఞాపక శక్తి కూడాతగ్గిపోతుంది .నిద్రలేమి సమస్య కారణం గా బరువు కూడా పెరిగిపోతారు. తగినంత నిద్ర లేనివారి లో ఆలోచించే శక్తి సామర్థ్యాలు కూడా బాగా తగ్గుతాయి.నిద్రలేమి సమస్యతో బాధపడే వారు సమస్యలను పరిష్కరించే శక్తి కూడా కోల్పోతారు. నిద్రలేమి సమస్య ఉన్న వారిలో నడుము భాగం లో కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది.
కనీసం రోజుకు ఏడు గంటల సమయం పాటు ప్రశాంతంగా నిద్ర పోవాలి. ఏడు గంటల సమయం కన్నా నిద్ర తక్కువైన ముఖం మీద మచ్చలు కళ్లకింద నల్ల చారలు, ముడతలు, ఏర్పడి .. వృద్ధాప్యం త్వరగా వస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లోతేలింది .కాబట్టి నిద్రని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు .