ప్రతిరోజూ వేరుశెనగ పప్పు తినడం వల్ల అది మీ ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజూ వేరుశెనగ పప్పు తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా? ఇటువంటి సందేహాలు ఏమి లేకుండా ప్రతిరోజూ వేరుశెనగ పప్పు తినొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పప్పు రోజూ తినడం మీ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
మీరు ప్రతిరోజూ వేరుశెనగ తింటే మీకు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాల లోపం ఉండదు అని నిపుణులు అంటున్నారు. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం మరియు ఐరన్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చిగా లేదా వేయించినావి అయినా లేదా ఉప్పు తో ఉడకపెట్టినవి అయినా తినవచ్చు. పల్లీల్లో మన శరీరానికి అవసరమైన చాలా పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. పల్లీల్లో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉండడం వలన వీటిని మోతాదుకు మించి తినకుండా ఉండడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఇరవై శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
వేరుశెనగలో ఉండే అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. హార్ట్ స్ట్రోక్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది. వేరుశెనగ పప్పులు వారంలో రెండు సార్లు కొంచెం కొంచెంగా తింటే గుండె సంబంధిత సమస్యలను దూరం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఆమ్ల గుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు వేరుశెనగ పప్పులను తక్కువగా తినడం మంచిది. ఆస్తమా ఉన్న వాళ్ళు వీటిని కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. గ్యాస్త్ట్రెటిస్ మరియు కామెర్లు ఉన్నవాళ్లు వీటిని దూరం పెడితే మంచిది.
ప్రతిరోజూ వేరుశెనగ తినడం సురక్షితమేనా? అంటే సమాధానం అవును అని చెబుతున్నారు పరిశోధకులు. ప్రతి రోజు వేరుశెనగ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు.